మచిలీపట్నం ఉల్లంగి పాలెం లో వేంచేసి ఉన్న శ్రీ దొంతులమ్మ అమ్మవారి 94 వ వార్షిక మహోత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి.
ఈ కార్యక్రమంలో భాగంగా పెద్ద కళ్ళేపల్లి ఓంకార పీఠాధిపతి విజయనంద స్వామీజీ ఆధ్వర్యంలో లక్ష్మీ గణపతి సహిత చండి హోమం కలశ స్థాపన పూజ కార్యక్రమం నిర్వహించారు. రంగనాయకులు, రవి వర్మ పర్యవేక్షణలో ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.