MachilipatnamLocal News
February 12, 2026
కృష్ణా జిల్లా

నా ఇండియా నా ఓటు ప్రతిజ్ఞ…. జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ

  • January 22, 2026
  • 0 min read
[addtoany]
నా ఇండియా నా ఓటు ప్రతిజ్ఞ…. జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ
మచిలీపట్నం :
 
        ఈ నెల 25వ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవం ఆదివారం ప్రభుత్వ సెలవు దినం రోజున వచ్చినందున జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలలో ఈ ఈనెల 23 వ తేదీన శుక్రవారం నా ఇండియా నా ఓటు అనే నినాదంతో ఓటర్ల ప్రతిజ్ఞ చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఒక ప్రకటనలో తెలిపారు. 
 
        ఈ మేరకు భారత ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి నుండి సమాచారం వచ్చిందని జిల్లా కలెక్టర్ వివరించారు. ఈ ప్రతిజ్ఞ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది అందరూ తప్పనిసరిగా పాల్గొనాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *