సంయుక్త కలెక్టర్ ఎం నవీన్ మాట్లాడుతూ క్రైస్తవులకు క్రిస్మస్ పండుగ చాలా ముఖ్యమైన పండుగ అన్నారు. క్రిస్మస్ పండుగను సంతోషంగా జరుపుకోవాలన్నారు. ఏసు ప్రభువు ప్రతి ఒక్కరిలో ప్రేమ, కరుణ, జాలి ఉండాలని బోధించారన్నారు.
వారి జీవితం ఆదర్శప్రాయం అంటూ తన వలె ఇతరులను కూడా ప్రేమించాలన్నది నేర్చుకోవాలన్నారు.
శత్రువులైన క్షమించగలిగే శక్తి ఉండాలన్నారు.
జీవితంలో మంచి సూత్రాలను పాటిస్తే భవిష్యత్తు బాగుంటుందన్నారు. ఆ స్ఫూర్తిని, విలువలను గుర్తు చేసుకుంటూ క్రిస్మస్ జరుపుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో డి ఆర్ ఓ కే చంద్రశేఖర రావు, కె ఆర్ ఆర్ సి ఎస్డిసి శ్రీదేవి, కలెక్టరేట్ ఏవో రాధిక, పర్యవేశకులు నెల్సన్, బేగ్, అబ్దుల్ జబ్బార్ పలువురు కలెక్టరేట్ సిబ్బంది, వారి పిల్లలు పాల్గొన్నారు.