MachilipatnamLocal News
December 28, 2025
కృష్ణా జిల్లా

బ్యాంక్, బీమా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా

  • December 19, 2025
  • 1 min read
[addtoany]
బ్యాంక్, బీమా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా
  బీమా రంగం లో 100% విదేశీ ప్రతక్ష పెట్టుబడులు అనుమతి ఇస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంకు నిరసనగా గురువారం వివిధ సంఘాల నాయకులు క్యాండిల్ లైట్స్ తో నిరసన ప్రదర్శన, ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా  నాయకులు మాట్లాడుతూ,బీమా రంగంలో విదేశీ పెట్టుబడుల పరిమితిని ప్రస్తుతమున్న 74 నుండి 100 శాతానికి పెంచుతూ తీసుకున్న నిర్ణయం ప్రజా ఆమోదం కాదని పేర్కొన్నారు.’సబ్కా బీమా సబ్కీ రక్ష’ – 2025 పేరుతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లు కూడా ప్రతిపక్షాల తీవ్ర వ్యతిరేకత, అభ్యంతరాల మధ్య పార్లమెంటు ఆమోదించింది అని, మరో ప్రక్క ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటీకరించాలని ప్రభుత్వం యోచిస్తోంది అని, ఈ చర్యలు ప్రజల పొదువు పై ప్రభావితం చేస్తాయని పేర్కొన్నారు. కొన్ని బ్యాంకుల్లో ప్రభుత్వ వాటాలను కూడ ఉపసంహరించాలని ప్రయత్నం జరుగుతోంది అని దీన్ని వ్యతిరేకించాలిసిన అవసరం వుంది అన్నారు. 
       ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్, బీమా సంస్థలకు చెందిన తొమ్మిది ఉద్యోగ సంఘాలు బీమా రంగంలో విదేశీ ఈక్విటీ 100 శాతం పెంపుదలను వ్యతిరేకిస్తూ సంయుక్తంగా నిరసన తెలిపారు. స్థానిక ఎల్ఐసి డివిజనల్ కార్యాలయం వద్ద ఈ నిరసన ప్రదర్శన నిర్వహించగ. బ్యాంక్, బీమా రంగాలకు అధికారులు, ఉద్యోగులు, ఏజెంట్ మిత్రులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. 
 
      ఇన్సూరెన్సు బ్యాంకు ఉద్యోగ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు జి. కిషోర్ కుమార్, డి. వాసు, వై స్వామినాధ్, ప్రసాద్, శ్రీనివాస్, వాణి, ఝాన్సీ, రాధా కృష్ణ మూర్తి, గుప్తా తదితర నాయకులు పాల్గొన్నారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *